హైదరాబాద్ : కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి అండగా ఉండి ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాదం బాలరాజ్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్కు అండగా ఉంటామన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం 6 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి యాదవ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు యాదవుల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గొర్రెలను పంపిణీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు.
తమ అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా యూనిట్ ధరను 1.25 లక్షల నుంచి 1.75 లక్షల రూపాయలకు పెంచడం వలన లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ రసాల వెంకటేష్ యాదవ్, తలసాని స్కైలాబ్ యాదవ్, నాంపల్లి టీఆర్ఎస్ ఇంచార్జి ఆనంద్, అశోక్ యాదవ్, గుడిగే శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయులు యాదవ్, గుడిగే సత్యనారాయణ యాదవ్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : నీటి గుంటలో పడి బాలుడు మృతి
హనుమంతరావును పరామర్శించిన గవర్నర్ దత్తాత్రేయ
ముంబైని ముంచెత్తుతున్న వానలు.. వీడియో
మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్