Telangana
- Nov 24, 2020 , 19:16:47
గ్రేటర్లో గెలిచేది గులాబీ పార్టీయే

హైదరాబాద్ : బల్దియాపై ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండాయే నని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్ది స్పష్టం చేశారు. వందకు పైగా డివిజన్ లలో టీఆర్ఎస్ సునాయాసంగా గెలువబోతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో అపార్ట్మెంట్, కాలనీ సంక్షేమ సంఘాలతో వ్యక్తిగత సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ప్రగతికి పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆప్ ఎంపీ సంజయ్సింగ్కు బెదిరింపులు
- ఆవిష్కరణల హైదరాబాద్.. సౌరవిద్యుత్లో బాగుబాగు
- రన్ వే పై చిరుత రయ్.. రయ్...! వీడియో వైరల్... !
- విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండా : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
- మరో 5జీ ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో..ప్రీ-బుకింగ్స్ ప్రారంభం
- వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజల్
- సహారా ఎడారిలో ఈ వింత చూశారా?
- బూర్గుల మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం
- గూగుల్ కస్టమర్లకు గుడ్ న్యూస్..!
- బర్డ్ ఫ్లూ నిజంగా ప్రమాదమేనా...?
MOST READ
TRENDING