వికారాబాద్ : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం మర్పల్లి మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లలిత, జడ్పీటీసీ మధుకర్, తాసీల్దార్ తులసీరామ్, వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు సొహెల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
టీకాల కొరత : కేంద్రంపై శివసేన ఎంపీ ఫైర్
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నిరు పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
నారింజ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద