హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1801 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో మరో 16 మంది మృతి చెందారు. కరోనా నుంచి 3,660 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 35,042 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇవాళ 61,053 మందికి పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 390 పాజిటివ్ కేసులు, రంగారెడ్డి జిల్లాలో 114, మేడ్చల్ జిల్లాలో 101 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.