లక్నో: ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్ వికాశ్ దూబే పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన విషయం తెలిసిందే. అయితే అది బూటకపు ఎన్కౌంటర్ అంటూ ఆరోపణలు వచ్చాయి. దానిపై సుప్రీం కోర్టు వేసిన కమిటీ తన నివేదికను సమర్పించింది. జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని ఎంక్వైరీ కమిషన్ తన నివేదికలో ఆ ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేనట్లు చెప్పింది. గత ఏడాది జూలైలో వికాశ్ దూబేతో పాటు మరో అయిదుగురు అనుచరుల్ని పోలీసులు హతమార్చారు. యూపీలో గ్యాంగ్స్టర్ను పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో వికాశ్ గ్యాంగ్ ఎనిమిది మంది పోలీసులు హతమార్చింది. ఆ తర్వాత పరారీ అయిన వికాశ్ను మధ్యప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు.
ఉజ్జయిని నుంచి యూపీకి తీసుకువస్తున్న సమయంలో పోలీసులు వాహనం బోల్తా పడింది. ఆ వాహనంలో ఉన్న వికాశ్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పోలీసులు వికాశ్ను కాల్చి చంపారు. వికాశ్ కాల్చివేత పట్ల మీడియాతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఎన్కౌంటర్ అంశంలో పోలీసులకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని, కానీ ఆ కాల్పులకు మద్దతుగా బోలెడు సమాచారం ఉన్నట్లు కమిటీ పేర్కొన్నది. వికాశ్ ఎన్కౌంటర్ను తప్పుపడుతూ ఎవరూ ఆధారాలు సమర్పించలేదని జస్టిస్ చౌహాన్ తన నివేదికలో తెలిపారు.