మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని గ్రామాలు దేశానికే తలమానికంగా తయారవుతున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగాబయ్యారం మండలంలోని సత్యనారాయణపురం, గంధంపల్లి ప్రాంతాల్లో పర్యటించారు. విద్యుత్ సబ్ స్టేషన్లను తనిఖీ చేసి హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. అనంతరం దళితవాడలలో తిరిగి గ్రామసభలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ఈ సారి పల్లె ప్రగతి కార్యక్రమం దళితవాడల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారన్నారు. త్వరలోనే దళిత జీవితాల్లో వెలుగు నింపే విధంగా సీఎం దళిత క్రాంతి పథకం రాబోతున్నదని మంత్రి తెలిపారు. ఇకపై దళితులు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడే విధంగా ఈ పథకం ఉపయోగపడనుందన్నారు.
ప్రతి గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందడానికి ప్రతి నెల నిధులు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో ట్యాంకర్లు, ట్రాలీలు, ట్రాక్టర్లు ఇచ్చి ఆయా గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చేస్తున్నారని ప్రశంసించారు.
చనిపోయినప్పుడు అంతిమ సంస్కారాలు గౌరవంగా జరగాలని అందుకోసం ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు నిర్మిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం లేరన్నారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, పీఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
పల్లెప్రగతితో మారిన జీవన పరిస్థితులు : మంత్రి ఎర్రబెల్లి