కోటపల్లి: లాక్డౌన్ సమయంలో మహారాష్ట్రవాసులు తెలంగాణలోకి ప్రవేశించకుండా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జనగామ గ్రామప్రజలు రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేశారు. ఓవైపు చెక్పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, గ్రామాల నుంచి చొరబాట్లు జరుగకుండా ప్రజలు చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 24 గంటలపాటు పహారా ఉంటుందని జనగామ గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు.