సూర్యాపేట : కొవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ సరఫరా అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఐసీఎంఆర్ నిబంధనలు దాటి ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. అయినా సీఎం కేసీఆర్ గ్లోబల్ టెండర్లకు అనుమతులు కోరారని ఆయన చెప్పారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీని వేసిందని ఆయన గుర్తుచేశారు.
కొవిడ్-19 పై సోమవారం జిల్లాలోని హుజూర్నగర్ ఏరియా దవాఖానలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేటీఆర్ అధ్యక్షతన వేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తుందని విధి విధానాలు రాగానే వ్యాక్సిన్ ను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.
మెరుగైన వైద్యం అంసించేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారని ఆయన తెలిపారు.
ఇప్పటి వరకు హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లోని 184 గ్రామ పంచాయతీలలో సర్వే నిర్వహించగా అందులో 3,289 మందికి పాజిటివ్ గా గుర్తించినట్లు మంత్రి వివరాలను వెల్లడించారు. వారిలో 2,486 మందికి మెడికల్ కిట్లు అందజేశామన్నారు.
హుజూర్నగర్, కోదాడలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలు సరిపోకపోతే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 200 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవచ్చని ఆయన చెప్పారు.
సూర్యాపేటలో ఏర్పాటు చేసిన 200 పడకల ఐసోలేషన్ కేంద్రంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి ఐసోలేషన్ కేంద్రాలలో వైద్య సేవలతో పాటు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
గద్వాలలో కరోనా రోగులకు నిత్యాన్నదానం
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన
కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి