బెంగళూర్ : అధికారుల కండ్లు కప్పి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. రూ 4.7 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను బెంగళూర్ కు చెందిన డీఆర్ఐ టీమ్ శుక్రవారం చిత్రదుర్గలో అరెస్ట్ చేసింది. నాటకీయ ఫక్కీలో 30 నిమిషా పాటు సాగిన ఛేజింగ్ తర్వాత నిందితులు పట్టుబడ్డారు.
కేరళ నుంచి ఏపీకి కర్నాటక మీదుగా భారీగా బంగారాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో డీఆర్ఐ టీం చిత్రదుర్గ పట్టణ శివార్లలో మాటువేసి ఇద్దరు నిందితులను పట్టుకుంది. నిందితులు తాము ప్రయాణిస్తున్న వాహనం సీటు కింద బంగారాన్ని దాచారు. సీజ్ చేసిన బంగారం 9.3 కిలోల బరువుంటుందని అధికారులు తెలిపారు.