ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన బీజేపీ.. 14 ఏండ్ల తర్వాత తిరిగి 2017 లో సరిగ్గా ఇదే రోజున అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో మంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా
పదవీ ప్రమాణం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 403 సీట్లకు గాను బీజేపీ కూటమి 324 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. బీజేపీ సొంతంగా 311 స్థానాల్లో గెలిచింది. బీజేపీ కూటమిలో
అప్పాదళ్ (సోనేలాల్) పార్టీ 9, భారతీయ సుహేల్దేవ్ సమాజ్పార్టీ 4 స్థానాల్లో గెలుపొందింది.
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు ఏడు దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్-రాహుల్ కూటమిని ప్రజలు తిప్పికొట్టారు. ఈ ఎన్నికల్లో సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ కూటమి కేవలం 54 స్థానాల్లో గెలిచి
సరిపెట్టుకోగా.. బీఎస్సీ 19 సీట్లలో, ఇతరులు ఆరు స్థానాల్లో గెలుపొందారు. మాయావతి నేతృత్వంలోని బీఎస్సీ వరుసగా రెండోసారి ఓటమిపాలైంది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కకలేదు.
కాగా, 2019లో సమాజ్వాదీ పార్టీతో పొత్తుకుదుర్చుకున్న బీఎస్సీ.. కొంతమేరకు సఫలీకృతమైంది. అయితే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 40 శాతం ఓట్లు పోలవడం విశేషం. ఈ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకున్న
యోగి ఆదిత్యనాథ్.. రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించి పార్టీని విజయపథానికి చేర్చడంలో విజయం సాధించారు. దాంతో ఆయననే యూపీ ముఖ్యమంత్రిగా నియమిస్తూ ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అప్పటి
జాతీయ అధ్యక్షుడు అమిత్షా నిర్ణయం తీసుకున్నారు.
దేశంలోని మొట్టమొదటి ఆధునిక నీటి నౌక ‘జలౌషా’ విశాఖపట్నంలో 1948 లో సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. 1941 లో సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్ను సేథ్ వాల్చంద్ హిరాచంద్ దీనిని
స్థాపించారు. దీనిని నేడు హిందుస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్ అని పిలుస్తున్నారు. షిప్యార్డ్కు పునాది రాయిని 1941 జూన్ 21 న అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వేశారు. స్వాతంత్ర్యం వచ్చిన
తరువాత పూర్తిగా భారతదేశంలో నిర్మించిన మొదటి నౌకను సింధియా షిప్యార్డ్లో నిర్మించారు. దీనికి ‘జలౌషా’ అని పేరు పెట్టారు. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సమక్షంలో దీనిని
1948 మార్చి 11 న జల ప్రవేశం చేయించారు.
జపాన్ ద్వీపంలో 2011 లో భారీ భూకంపం సంభవించింది. అదే సమయంలో తీవ్ర సునామీ వచ్చింది. జపాన్లోని పసిఫిక్ తీరంలో తోహోకు సమీపంలో సముద్రంలో రిక్టర్ స్కేల్పై 9 తీవ్రతతో భూకంపం
సంభవించింది. 15 వేలకు పైగా ప్రజలు మరణించడంతోపాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇది ఇప్పటివరకు జపాన్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన భూకంపంగా రికార్డులకెక్కింది. సునామీ కారణంగా జపాన్లో
చాలా పట్టణాలు జలదిగ్బంధంలో చుట్టుకుని పోయి తీవ్రంగా నష్టపోయాయి.
2008: పాకిస్తాన్లోని లాహోర్లో జరిగిన రెండు ఆత్మాహుతి పేలుళ్లలో 26 మంది దుర్మరణం
2007: రివర్స్ గేర్లో డ్రైవింగ్ చేస్తూ కోల్కతా నుంచి వాఘా సరిహద్దు వరకు 2,012 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసి రికార్డులకెక్కిన సునీత
2006: దహన సంస్కారాలను అనుమతించే చట్టాన్ని ఆమోదించిన గ్రీకు పార్లమెంట్
2004: స్పెయిన్లోని మూడు రైల్వే స్టేషన్లలో బాంబు పేలుళ్లు.. 190 మంది దుర్మరణం
2001: బ్యాడ్మింటన్లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన పుల్లెల గోపిచంద్
1999: నాస్డాక్ ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా అయిన మొదటి భారతీయ కంపెనీగా నిలిచిన ఇన్ఫోసిస్
1990: లిథువేనియాకు స్వాతంత్ర్యం ప్రకటన
1918: రష్యా రాజధానిగా మారిన మాస్కో
1689: శివాజీ కుమారుడు శంభాజీని హత్యచేసిన ఔరంగజేబు