నల్లగొండ : పోలీస్ భద్రత పథకం పోలీస్ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపుతూ ఆర్థిక భరోసా కల్పిస్తుందని నల్లగొండ అదనపు ఎస్పీ సి. నర్మద అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల మరణించిన ఏ.ఎస్.ఐ. పోలా ప్రభాకర్ సతీమణి మనోహరికి రూ. 3,97,795 రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందన్నారు.
ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ధిని సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని ఆమె చెప్పారు.
అదే విధంగా భద్రత స్కీమ్ ద్వారా చనిపోయిన పోలీస్ కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ ఏ.ఓ. మంజు భార్గవి, సూపరింటెండెంట్ కె. దయాకర్ రావు, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్ తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
ములుగు జిల్లాలో బాలికపై లైంగికదాడి
టీకాల కొరత : కేంద్రంపై శివసేన ఎంపీ ఫైర్
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నిరు పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
నారింజ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద