హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైనదని, చారిత్రాత్మకమైనదని పలువురు సీనియర్ జర్నలిస్టులు కొనియాడారు. ఈ ఇరవై ఏండ్ల పోరాటాన్ని పుస్తక రూపంలో తీసుకురావాల్సిన అవసరం ఉన్నదన్నారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం నిర్వహించిన జూమ్ మీటింగ్లో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమం లో జర్నలిస్టులు పోషించిన పాత్రను కొనియాడారు.
ఉద్యమ తొలి రోజుల్లో జర్నలిస్టులు చేసిన సాహసం మరువలేనిదని కే శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతు లు ఇవ్వకపోతే జర్నలిస్టులే ముందుండి వాటిని నడిపించారని, మారుమూల ప్రాంతాల్లో గ్రామీణ జర్నలిస్టులు పోషించిన పాత్ర అమోఘమని ఘంటా చక్రపాణి కొనియాడారు. గుప్పెడు మందితో ప్రారంభమైన తెలంగాణ జర్నలిస్టు ఫోరం.. వందలు, వేలుగా విస్తరించి, రాష్ట్ర సాధనలో అడుగడుగు నా గొప్ప పాత్రను పోషించిందని మీడియా అకాడమీ చైర్మ న్ అల్లం నారాయణ వివరించారు. సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, వ్యవస్థాపక సభ్యులు కే రమేశ్బాబు, రమణకుమార్, రాజేశ్, తేమ్జు అధ్యక్షుడు ఇస్మాయిల్ పాల్గొన్నారు.