సిరికొండ, మే 20: కరోనా వ్యాప్తి కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై రాజశేఖర్ కోరారు. మండలకేంద్రంలో సిబ్బందితో కలిసి వాహనాలను గురువారం తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల తర్వాత ఇండ్ల నుంచి బయటికి వచ్చిన వారి వివరాలను తెలుసుకొని సరైన ఆధారాలు చూపని వారికి జరిమానా విధించారు. అత్యవవర సేవా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల గుర్త్తింపు కార్డులను పరిశీలించి వారికి అనుమతి ఇచ్చారు. లాక్డౌన్ సమయంలో అకారణంగా బయటికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేస్తాం
కోటగిరి, మే 20 : లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేస్తామని కోటగిరి ఇన్చార్జి ఎస్సై రవీందర్ హెచ్చరించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారి వాహనాలను గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిలిపి వేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో పోలీసులు శ్రీనివాస్, రాజ్గోపాల్ ఉన్నారు.
ప్రతిఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలి
ధర్పల్లి, మే 20 : ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనల ను పాటించాలని ధర్పల్లి ఇన్చార్జి ఎస్సై నరేశ్ సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత అన్ని రకాల వ్యాపార సముదాయాలను మూసి ఉంచాలన్నారు. అనవసరంగా బయటికి వచ్చిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సిబ్బందితో కలిసి మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి లాక్డౌన్ అమలుతీరును పరిశీలించారు.