వట్పల్లి /సంగారెడ్డి : తొమ్మిది సంవత్సరాలుగా ఆగిపోయిన వట్పల్లి- జోగిపేట రోడ్డు నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కృషి ఫలించింది. రోడ్డు విస్తరణలో భూమి కోల్పోతున్న రైతులకు భరోసా కల్పించడంతో రైతులు సంతృప్తి చెంది రోడ్డు నిర్మాణం కోసం అంగీకరించారు. కొన్నేండ్లుగా నష్టపరిహారం చెల్లింపులో జాప్యం అవుతుందని రైతులు చెప్పడంతో ప్రభుత్వం నుంచి సకాలంలోనే నష్టపరిహారం అందుతుందని అందుకు తాను కృషి చేస్తానన్నారు.
దీంతో తొమ్మిదేండ్లుగా ఆగిపోయిన వట్పల్లి- జోగిపేట వయా నాగులపల్లి రోడ్డు నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. రేపటి నుంచి పని మొదలు పెట్టి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ సంద్భంగా రైతులను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ నారాయణ గౌడ్, రైతు బంధు అధ్యక్షుడు అశోక్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ