న్యూఢిల్లీ : దేశంలో వ్యాక్సిన్ల కొరతపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీకా నిల్వల ఏర్పాట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను ప్రభుత్వం విస్మరించిన కారణంగానే వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందన్నారు. టీకా డ్రైవ్ను పెంచేటప్పుడు అందుబాటులో ఉన్న టీకా నిల్వను, డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని టీకా కార్యక్రమంలో భారత ప్రభుత్వం ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నదని శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో జాదవ్ చెప్పారు. ప్రారంభంలో 300 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా, 60 కోట్ల మోతాదు అవసరమని చెప్పారు. “లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు 45 ప్లస్ వయస్సు గల వారందరికీ, 18 ఏళ్లు పైబడిన వారికి కూడా ఈ వ్యాక్సిన్ను ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఈ టీకాల నిల్వ మన దగ్గర లేదని ప్రభుత్వానికి కూడా తెలుసు. మేము ఉత్పత్తి లభ్యతను దృష్టిలో ఉంచుకుని దానిని న్యాయంగా ఉపయోగించాలని నేర్చుకున్నాం” అని పేర్కొన్నారు.
టీకాలు వేయడం చాలా అవసరమని, అయితే టీకా మోతాదు వచ్చిన తర్వాత కూడా ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారని జాదవ్ చెప్పారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. టీకాలు వేసిన తర్వాత కూడా ప్రజలు కరోనా మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. టీకా వేరియంట్ డబుల్ మ్యూటాంట్ కూడా ప్రభావవంతంగా ఉంటుందని ఆయన చెప్పారు.
ఎగిరే యంత్రానికి రైట్ బ్రదర్స్కు పేటెంట్.. చరిత్రలో ఈరోజు
జీ-7 ఆరోగ్య మంత్రుల సమావేశానికి భారత్కు ఆహ్వానం
ఎన్నికల్లో అధిక ఖర్చుపై ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడిపై విచారణ
బ్లాక్ ఫంగస్ తర్వాత.. ఇప్పుడు వైట్ ఫంగస్ ఇబ్బందులు
అంటార్కిటికాలో అతిపెద్ద మంచుకొండ గుర్తింపు
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..