సిద్దిపేట, అక్టోబర్ 8 : హరితహారంలో నాటిన చెట్టును అనుమతులు లేకుండా ధ్వంసం చేసిన వ్యక్తికి రూ.10 వేల జరిమానా విధించారు. హరితహారం అధికారి ఐలయ్య మాట్లాడుతూ.. 1వ వార్డుకు చెందిన పురంశెట్టి శివకుమార్ నిర్మాణానికి అడ్డువస్తుందని రాత్రి సమయంలో హరితహారంలో నాటిన చెట్టను నరికాడు.
ఈ విషయం సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నా మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. సదరు వ్యక్తికి రూ.10 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. హరితహారం చెట్టను ఎవరు నరికి చర్యలు తీసుకుంటామన్నారు.