కాల్వల నిర్మాణానికి అందరూ సహకరించాలి : దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
మూసాపేట, ఏప్రిల్ 1 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన కరివెన రిజర్వాయర్తో దేవరకద్ర నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని జానంపేట గ్రామంలో రూ.10లక్షలతో సీసీరోడ్లు, రూ.10లక్షలతో మురుగు కాల్వల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం డబుల్బె డ్రూం ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇండ్ల పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూ చించారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న హనీఫ్ను పరామర్శించి అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం పోల్కంపల్లి గ్రామంలో సింగిల్విం డో ఆధ్వర్యంలో నిర్మించిన గోదామును ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. త్వరలోనే కాల్వల ఏర్పాటుకు రూపకల్పన చేయనున్నట్లు పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కరివెన రిజర్వాయర్ నిండితే దేవరకద్ర నియోజకవర్గంలో మూడు పంటలు పుష్కలంగా పండుతాయన్నారు. అయితే, కాల్వల నిర్మాణానికి రైతులు, ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, రైతుబంధు సమి తి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతీకొండయ్య, సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, తాసిల్దార్ మంజుల, ఎంపీడీవో ఉమాదేవి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రామలింగేశ్వరస్వామి ఆలయ చైర్మన్కు సన్మానం
మూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 1 : మండలంలోని కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయ చైర్మన్గా నూ తనంగా ఎన్నికైన దండు కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే ఆల సన్మానించారు. అందరూ సమిష్టిగా పనిచేసి రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కందూరు జాతరకు రావాలని ఎంపీపీ దోనూరు నాగార్జున్రెడ్డితో కలిసి గ్రామస్తులు ఎమ్మెల్యే ఆలను ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహమూద్, డైరెక్టర్లు రాములుయాదవ్, శ్రీనివాసాచారి, నాయకులు రమేశ్గౌడ్, రాజేశ్వర్రెడ్డి, భాస్కర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు వినతి
దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 1 : చిన్నచింతకుంట మం డలంలోని పర్కాపూర్ గేటు నుంచి దమగ్నాపూర్కు బీటీరోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రోడ్డు సరి గా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపా రు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ అధికారులతో మాట్లాడి బీటీరోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.