ఒక్కోసారి కొన్ని కేసులు పోలీసులకు సవాలు విసురుతాయి. ఇంకొన్ని తంటాలు తెచ్చిపెడతాయి. ఇప్పుడలాంటి పరిస్థితిలోనే ఉన్నారు చందుర్తి పోలీసులు. విషయం ఏంటంటే సిరిసిల్ల జిల్లా బండపల్లి గ్రామానికి చెందిన గశికంటి రాజు తన కోడిని చంపేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇసుక ట్రాక్టర్ తో గుద్ధి మరీ చంపారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన కోడి చంపేసిన వారిని శిక్షించాలని పోలీసులను కోరాడు. చనిపోయిన కోడితో స్టేషన్కు వచ్చిన రాజుని చూసి పోలీసులు నవ్వుకున్నారు. అంతేకాదు ఈ విషయం గ్రామంలో హాట్ న్యూస్ గానూ మారింది.