సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో అతి పురాతన చారిత్రక ఆధారాలు లభించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, శ్రీరామోజు పద్మావతి, అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్ సోమవారం తెలిపారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ఎదురుగా ఉన్న గుడిలో కాకతీయుల కాలం నాటి పానపట్టం లేని శివలింగం(సమలింగం), గుడిబయట వినాయక విగ్రహాలు, నందులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర కూటుల కాలంనాటి మూడు నాగశిల్పాలను గుర్తించినట్టు వారు తెలిపారు.
– సిద్దిపేట అర్బన్