తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 32,762 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో అక్కడ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22 లక్షలకు చేరువయ్యింది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 112 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,724కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 48,413 మంది కరోనా బాధితులు వైరస్ బారినుంచి బయటపడగా మొత్తం రికవరీల సంఖ్య 18,94,518కి చేరింది.