కాచిగూడ, ఏప్రిల్ 19: అంబర్పేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వచ్చే రెండేండ్లలో పరుగులు పెట్టిస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని కృష్ణాననగర్లో రూ.7లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైపులైన్ పనులను సోమవారం గోల్నాక కార్పొటర్ దూసరి లావణ్య శ్రీనివాస్గౌడ్తో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు డివిజన్లలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎప్పుడో ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైపులైన్లు ప్రస్తుత జనాభా అవసరాలకు అనుగుణంగా లేక పోవడంతో డ్రైనేజీ సమస్య తలెత్తుతోందని అన్నారు. ఈ సమస పరిష్కారంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు.