న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రెండు రోజుల క్రితం రికార్డు స్థాయిలో నాలుగు లక్షలకుపైగా నమోదవగా, అవి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజూ 4 లక్షలకు దిగువనే నమోదయ్యాయి. కాగా వరుసగా ఐదోరోజు కూడా మూడు వేలకు పైగా మరణాలు రికార్డవడం గమనార్హం. అయితే తాజాగా 3.6 లక్షల కేసులు నమోదవడంతో మొత్తం కేసులు రెండు కోట్లకు చేరువలో నిలిచాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,68,147 మంది కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,99,25,604కు చేరాయి. ఇందులో 16,29,3003 మంది బాధితులు కోలుకోగా, 34,13,642 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 2,18,959 మంది వైరస్ వల్ల మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 3,00,732 మంది బాధితులు కరోనా నుంచి బయటపడి డిశ్చార్జీ అయ్యారు. మరో 3417 మంది బాధితులు కన్నుమూశారు. ఇప్పటివరకు 15,71,98,207 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 56,647 కేసులు ఉండగా, కర్ణాటకలో 37,773, కేరళలలో 31,959 చొప్పున నమోదయ్యాయి. ఇక కరోనా మరణాల్లోనే మహారాష్ట్రే ముందు వరుసలో ఉన్నది. రాష్ట్రంలో నిన్న 669 మంది మృతిచెందగా, ఉత్తరప్రదేశ్లో 288, కర్ణాటకలో 217 మంది బాధితులు చనిపోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..