రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన రేపుతున్నది. కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో హోమ్ ఐసొలేషన్లో ఉంటున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సీఎం భూపేశ్ భాగెల్ రాయ్పూర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ‘ఆక్సిజన్ ఆన్ వీల్’ సేవలను ఆన్లైన్ ద్వారా శనివారం ప్రారంభించారు.
దీని ద్వారా ఇండ్లలో ఐసొలేషన్లో ఉన్న కరోనా రోగులకు అత్యవసరమైతే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ను ఇంటి వద్దకే పంపుతారు. అలాగే కరోనా రోగులకు ఉచితంగా డ్రై రేషన్ పంపిణీ చేయడంతోపాటు ఉచితంగా అంబులెన్స్ సేవలను అందిస్తారు. కరోనా రోగులకు చికిత్స కోసం ఇండోర్ స్టేడియాన్ని కరోనా ఆసుపత్రిగా మార్పు చేశారు.