మహబూబాబాద్ : జిల్లాలోని నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని హరితహారం కార్యక్రమంలో భాగంగా అందంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ప్రియాంక వర్గీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తో కలిసి నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నూతన భవన సముదాయం ఖాళీ స్థలాన్ని రోడ్లు భవనాలు శాఖ ఇంజినీరింగ్ అధికారులు మ్యాప్ ద్వారా స్థలం వివరాలు సరిహద్దులను వివరించారు.
ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ.. కాంపౌండ్ లో స్థలాన్ని చెట్లు నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. కార్యాలయ భవనం పూర్తయ్యేలోపు చెట్లు ఎదిగి భవన సముదాయం అందంగా కనిపిస్తుంన్నారు. కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ అధికారి తానేశ్వర్, డీఈ రాజేందర్, ఎఫ్డీవో కృష్ణమాచారి, ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం
అభివృద్ధి పనుల్లో అలసత్వంపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్కు గద్దర్
వెయ్యి మొక్కలు నాటించిన మంత్రి పువ్వాడ