నిజామాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కామారెడ్డి టౌన్: కామారెడ్డిలో నిర్మించిన నూతన కలెక్టరేట్, పోలీస్ భవనాలు అద్భుతంగా ఉన్నాయని, త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, డీజీపీ మహేందర్రెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేతారెడ్డితో కలిసి భవనాలను పరిశీలించారు. వందశాతం నిర్మాణ పనులు, సుందరీకరణ పూర్తి చేసుకున్న కలెక్టరేట్, ఎస్పీ భవనాల వద్ద తుది మెరుగులకు సంబంధించి అలంకరణ పనులపై ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలు అందించారు.