హైదరాబాద్ : డిపార్ట్మెంటల్ పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం వెలువరించింది. కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపు కారణంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ మే 2021 సెషన్ను వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణకు కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ www.tspsc.gov.in ని సందర్శించాల్సిందిగా సూచించింది.