మెదక్ : అనారోగ్య సమస్యలు వేధిస్తుండటం.. తమను ఆదరించేందుకు ఎవరూ లేకపోవడంతో ఆవేదన చెంది దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో విషాద ఘటన జరిగింది. గాంధీనగర్ ప్రాంతానికి చెందిన రాముడు (48), శీలక్ష్మి (44) దంపతులకు ఇద్దరు కూమార్తెలు సంతానం. ఇద్దరికి వివాహాలు కావడంతో అత్తారింటికి వెళ్లిపోయారు.
ఇటీవల రాముడికి పక్షవాతం రావడంతో మంచానికే పరిమితయ్యాడు. శ్రీలక్ష్మి సైతం తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నది. ఈ క్రమంలో తమను ఆదరించేందుకు ఎవరూలేరన్న భావనలో తీవ్ర మనోవేదనకులోనై శనివారం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చీరెతో ఉరివేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గిరిజన అమ్మాయిపై అఘాయిత్యం.. ఆపై హత్య
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్.. రూ.5 లక్షలు స్వాధీనం
కరోనాతో తల్లి మృతి.. చెరువులో దూకి కుమారుడు ఆత్మహత్య..
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.