కేంద్ర మంత్రి రేణుకాసింగ్
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం గోండి భాష పరిరరక్షణకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కేంద్ర మంత్రి రేణుకా సింగ్ ప్రశంసించారు. కోయ, గోండి, కొలామ్, లంబాడా భాషల రక్షణ, అభివృద్ధికిపై సోమవారం లోకసభలో ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. యునెస్కో గుర్తించిన అంతరించిపోతున్న భాషల్లో గోండి ఒకటని, దాని పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని తుం గలో తొక్కి రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు విమర్శించారు. సోమవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చి తీరా అక్కడి గనుల్లో నాణ్యత లేదనటం పరిశ్రమను ఎత్తివేసేందుకు సాకు చెప్పటమేనని మండిపడ్డారు. కేంద్రం జవహర్ నవోదయ విద్యాలయాలను (జెన్వీ) కొన్నిరాష్ర్టాలకే కేటాయిస్తూ తెలంగాణపై వివక్ష చూపుతున్నదని టీఆర్ఎస్ సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు విమర్శించారు. రాష్ట్ర కాలుష్య మండలికి నిధులు పెంచాలని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు.