హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): మాస్కులు విధిగా ధరించడం వల్ల కరోనాను కట్టడి చేయడంతోపాటు, ప్రస్తుతం వైరస్ ద్వారా సంభవిస్తున్న మరణాల రేటును నుంచి 87 శాతం తగ్గించవచ్చని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనంలో వెల్లడైంది. సీడీసీకి చెందిన పరిశోధకుల బృందం, నేషనల్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ యూఎస్ సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. డబుల్ మాస్కులు ధరించడం వల్ల యూకే వైరస్ వేరియంట్ బారినపడకుండా కాపాడుకోవచ్చని పేర్కొన్నాయి. ఆర్నెళ్లపాటు మాస్క్ వినియోగం- ప్రయోజనాలు అంశంపై యూఎస్లో జరిగిన అధ్యయనంలో విషయాలు వెల్లడయ్యాయి.
కేవలం క్లాత్ మాస్క్ వినియోగించడం వల్లనే మరణాల శాతం 82 శాతం తగ్గినట్టు అధ్యయనం స్పష్టంచేసింది. వైరస్వ్యాప్తి చెందకుండా మెడికల్ మాస్కులు 78 శాతం, క్లాత్ మాస్కులు 69 శాతం అడ్డుకుంటాయని పేర్కొన్నది. ఒకరి నుంచి ఆరుగురికి వ్యాప్తి చేందేంతగా వైరస్ మ్యుటేషన్ పొందిందని, దీని వ్యాప్తిని అడ్డుకోవడంలో డబుల్ మాస్కుల వినియోగం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. ఇన్ఫెక్షన్ సోకినవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఇలాంటి చర్య వల్ల ఒక్కరికి మాత్రమే వైరస్ పరిమితమవుతుందని సూచించింది. సెకండ్వేవ్లో చాలామందిలో లక్షణాలు కనిపించడం లేదని, అలాంటివారికి కొవిడ్ వచ్చిన విషయం కూడా తెలియడం లేదని పేర్కొన్నది. అందుకే పాజిటివ్ ఉన్నా లేకున్నా ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం వల్ల ఇన్ఫెక్షన్ గొలుసును తెంపవచ్చని సూచించింది.