రియల్ హీరో సోనూసూద్ కరోనా కష్టకాలంలో తనకు చేతనంత సాయం చేసుకుంటూ వెళుతున్నారు. రీసెంట్గా నాగ్పూర్కు చెందిన భారతి అనే యువతి ఊపరితిత్తులు కరోనా వలన 85 శాతం దెబ్బతినడంతో ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయించి హైదరాబాద్కు తీసుకొచ్చారు. కొద్ది రోజులుగా భారతికి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది.
కొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతూ వచ్చిన భారతి కన్నుమూశారు. ఈ విషయాన్ని సోనూసూద్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. కోవిడ్తో పోరాటం చేస్తున్న భారతి అనే యువతిని ఇటీవల నాగ్పూర్ నుండి హైదరాబాద్కు ఎయిర్ అంబులెన్స్లో తరలించాం. శుక్రవారం రాత్రి ఆమె మరణించింది. నెల రోజుల పాటు జీవిత పోరాటం చేసిన ఆమెకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఆమెను బతికిస్తానని ఎంతో అనుకున్నాను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. నా హృదయం ముక్కలైంది’’ అని సోనూసూద్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
కరోనాతో మరో ప్రముఖ నటుడు మృతి
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం
క్రికెటర్ భువనేశ్వర్ యాంకర్ శ్యామలకు సోదరుడా?
మార్స్పై నాసా హెలికాప్టర్ చక్కర్లు.. తొలిసారి ఆడియో కూడా రికార్డ్.. వీడియో