కరీంనగర్ : సబ్ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేస్తున్నదని ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మంద కృష్ణ కేవలం ఉనికి కోసమే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పర్యటించారు. ముందుగా పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో సమీకృత మార్కెట్ నిర్మాణం కోసం ఒకరం 10 గుంటల స్థలం, రూ.3 కోట్లు మంజూరు చేయగా, దానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం సువర్ణ ఫంక్షన్ హాల్లో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించగా, ముఖ్య అతిథులు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్సీలు సారయ్య, దయానంద్, రాష్ట్ర టూరిజం, హస్తకళల చైర్మన్లు శ్రీనివాస్ గుప్తా, సంపత్కుమార్, నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, తదితరులతో కలిసి మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వారు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు తయారు చేసి అందిస్తున్నారని తెలిపారు.
ఆర్యవైశ్యులకు అండగా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నదని, దేశభక్తి, మతం పేరిట రాజకీయం చేస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తాం
ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
పల్లెప్రగతితో మారిన జీవన పరిస్థితులు : మంత్రి ఎర్రబెల్లి