వరంగల్ అర్బన్ : దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు దళిత సాధికారత పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం కమలాపూర్ మండలం మాదన్నపేట, గూడూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితుల స్వావలoబనకు దళిత్ ఎంపవర్మెంట్ స్కీం దోహదం చేస్తుందన్నారు. ఈ పథకం కింద నిరుపేద దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సహాయం అందుతుందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం నాలుగు వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుచేసినా ఒక్క ఇల్లు కూడా నిర్మించకపోవడం బాధాకరమన్నారు.
టీఆర్ఎస్లో పలువురి చేరిక
మాదన్నపేట గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేస్తూ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇవి కూడా చదవండి..
తహసీల్దార్ ఆఫీస్కు తాళి కట్టిన ఘటనపై విచారణ
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే పట్నం
పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి