మహబూబ్నగర్ :దళిత సమాజానికి ధైర్యానిచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని జడ్చర్ల ఎమ్మెల్యే డా. సి.లక్ష్మా రెడ్డి అన్నారు. దళిత సాధికారిత పథకాన్ని హర్షిస్తూ జడ్చర్ల నియోజకవర్గ దళిత సామాజిక సంఘాల ఆధ్వర్యంలో బాదేపల్లి చంద్ర ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కృతజ్ఞతా సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అట్టడుగున ఉన్న దళితులను సమాజంలో తలెత్తుకుని జీవించేలా సీఎం కేసీఆర్ దేశ చరిత్రలోనే ఒక గొప్ప అడుగు వేశారని లక్ష్మారెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి నిరుపేద దళితుడు స్వయం సమృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్ దళిత సాధికారిత పథకాన్ని ప్రవేశ పెట్టాడని పేర్కొన్నారు. దళిత సమాజాన్ని అభివృద్ధి పథంలోకి నడిపేందుకు కేసీఆర్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం దేశంలో ఒక సంచలనం సృష్టించిందన్నారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాబోయే మూడేళ్లలో దళితుల అభివృద్ధి కోసం రూ. 40 వేల కోట్లను ఖర్చు చేయడానికి ప్రణాళిక సిద్ధం అవుతున్నదని తెలిపారు. ఎస్సీలకు కాంట్రాక్టు అవకాశాలు కల్పించి వారి అబివృద్ధికి తోడ్పాటునందిచాలని సీఎం కేసీఆర్ ప్రత్యేక కోటా కల్పించారని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్!
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్కు భారీ టీమ్ను పంపనున్న చైనా
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి : మంత్రి అల్లోల