నల్లగొండ : దళిత సమాజానికి ధైర్యానిచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. దళిత సాధికారిత పథకాన్ని హర్షిస్తూ నకిరేకల్ నియోజకవర్గ దళిత సామాజిక సంఘాల ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన కృతజ్ఞతా పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మొదట ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికిపూలమాల వేసి అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. అట్టడుగున ఉన్న దళితులను సమాజంలో తలెత్తుకుని బతికేలా సీఎం కేసీఆర్ దేశ చరిత్రలోనే ఒక గొప్ప అడుగు వేశారని తెలిపారు. రాష్ర్టంలోని ప్రతి నిరుపేద దళితుడు స్వయం సమృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్ దళిత సాధికారిత పథకాన్ని ప్రవేశ పెట్టడం దళితజాతి బిడ్డగా తాను సంతోషిస్తున్నాని పేర్కొన్నారు. దళిత సమాజాన్ని అభివృద్ధి పథంలోకి నడిపేందుకు ఆయన తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం దేశంలో ఒక సంచలనం సృష్టించిందన్నారు.
ఇవి కూడా చదవండి..
కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తాం
ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
పల్లెప్రగతితో మారిన జీవన పరిస్థితులు : మంత్రి ఎర్రబెల్లి