కరీంనగర్: కారు గుర్తు, గులాబీ జెండాతోనే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది పాల్గొన్నారని, వారంతా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలోనే ఉద్యమించారని, అందులో ఈటల ఒక కార్యకర్త మాత్రమేనని తెలిపారు.
‘టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత 2003లో ఈటల పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేసేందుకు హుజురాబాద్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఈటల పార్టీ నుంచి వెళ్లిపోతే ఎవరూ బాధపడటం లేదు. ఈటల రాకముందే నలుగురు ఎంపీపీలతో పాటు 80 శాతం మంది ఎంపీటీసీలు గెలిచారని’ సారయ్య పేర్కొన్నారు.