కొలంబో: శ్రీలంకలో జరిగిన అందగత్తెల పోటీ వివాదానికి తెరలేపింది. మిసెస్ శ్రీలంక టైటిల్ గెలిచిన పుష్పికా డిసిల్వాకు అవమానం ఎదురైంది. అందగత్తెల పోటీల్లో స్టేజ్ మీదే ఆమె గాయపడింది. మిసెస్ శ్రీలంక ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగింది. టైటిల్ గెలిచిన పుష్పిక డిసిల్వాకు.. తొలుత ఆమె తలపై కిరీటాన్ని తొడిగారు. అయితే అదే స్టేజ్పై ఉన్న 2019 మిసెస్ శ్రీలంక విజేత కరోలైన్ జూరీ స్టేజ్పై అనుచితంగా వ్యవహరించింది.
2021 విన్నర్ పుష్పిక డిసిల్వా తలపై నుంచి కిరీటాన్ని తీసి రన్నరప్కు కరోలినా తొడిగింది. రన్నరప్కు బ్యూటీ కిరీటాన్ని తొడగడంతో.. స్టేజ్ మీదున్న విన్నర్ పుష్పిక అక్కడ నుంచి వెళ్లిపోయింది. అయితే మిసెస్ శ్రీలంక అవార్డును కేవలం పెళ్లి అయిన మహిళలకే ఇస్తారని, కానీ విడాకులు తీసుకున్నవారికి కాదు అని కరోలినా ఆ స్టేజ్ మీదే పేర్కొన్నది.
ఆ రూల్ ప్రకారం రన్నరప్కు బ్యూటీ కిరీటం దక్కుతుందని కరోలినా చెప్పింది. ఈ వివాదంపై విన్నర్ పుష్పిక తన సోషల్ మీడియా అకౌంట్లో స్పందించింది. తాను విడాకులు తీసుకోలేదని, ఒకవేళ విడాకులు తీసుకుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని పుష్పిక డిమాండ్ చేసింది. వివాదాన్ని నిర్వాహకులు పరిష్కరించారు. అసలైన విన్నర్ పుష్పిక డిసిల్వానే అని తేల్చారు.