రామచంద్రాపురం/సంగారెడ్డి : బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాముఖ్యత ఇస్తుందని రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బోనాల వేడుకకు ప్రభుత్వం కావాల్సిన సహాయసహకారాలను అందిస్తుందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తున్నాయని తెలిపారు. ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తు బోనాల వేడుకలను జరుపుకోవాలన్నారు. అలాగే భెల్లోని పెద్దమ్మతల్లి ఆలయంలో జరిగిన బోనాల వేడుకలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇవి కూడా చదవండి.
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి
వెలుగులోకి మరో పోర్న్ రాకెట్ ..కటకటాల వెనక్కి వర్ధమాన నటి
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత