కంది/సంగారెడ్డి : ప్రమాద రహిత రహదారులుగా నేషనల్ హైవేలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తామని రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ సందీప్ శ్యాండిల్య అన్నారు. మంగళవారం కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్లో జిల్లా ఎస్పీ రమణకుమార్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాప్స్పోర్టు హైవేస్ రీజినల్ అధికారి కె.కుశ్వాహ ఆధ్వర్యంలో జాతీయ రహదారులపై తరచూ జరుగుతున్న ప్రమాదాలను ఎలా నివారించాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ చర్చలో ప్రధానంగా ఎన్హెచ్-65 పై గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, వాటికి గల కారణాలను విశ్లేషించారు. ఇదే రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఐఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలు నూతన సాంకేతికత ఆధారంగా రోడ్డు ప్రమాదాలను ఏ విధంగా నివారించవచ్చు అనే అంశాలను ప్రస్తావించారు.
వీటితో పాటు పాదచారులు రోడ్డు దాటడానికి అవసరమైన ఫుట్ ఓవర్ బ్రిడ్డ్, అండర్ పాస్ల నిర్మాణ, వాటి ఏర్పాటులో ఉన్న ఇబ్బందులు ఏమిటి అని చర్చించుకున్నారు. రోడ్లపై ఏ ఏ ప్రాంతాల్లో సూచిక బోర్డులను ఏర్పాటు, జంక్షన్ సమీపించే ముందు వాహన వేగాన్ని ఎలా అదుపు చేయవచ్చు అనే వివరాలను సేకరించారు.
కార్యక్రమంలో ఆర్అండ్బీ నేషనల్ హైవేస్ ఎస్.ఇ శ్రీనివాస్, ఐఐటీ ప్రొఫెసర్ దిగ్విజయ్ పవార్లతో పాటు ఎస్బీ డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, పటాన్చెరు, సంగారెడ్డి డీఎస్పీలు భీమ్రెడ్డి, బాలాజీ, సంగారెడ్డి రూరల్ సీఐ శివలింగం, ట్రాఫిస్ సీఐ ముజీబ్ ఉర్ రహ్మన్, పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, వేణుగోపాల్, మాదాపుర్ ట్రాఫిక్ ఏసీపీ ఏ.చంద్రశేఖర్, మియాపూర్ ట్రాఫిక్ సీఐ ఎన్.సుమన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Job news : ఇన్కాయిస్లో 82 పోస్టులు
ఎదురెదురుగా రెండు విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం
గడ్డం పెంచుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదు..!
సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి