నిజాంసాగర్, ఏప్రిల్ 29: వ్యాక్సినేషన్పై ప్రజల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టడానికి కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల తాసిల్దార్ సువర్ణ వినూత్నంగా ఆలోచించారు. తాసిల్ కార్యాలయంలోనే ఓ వైద్యబృందాన్ని ఏర్పాటు చేసి ఆఫీసుకు వచ్చే వారందరికీ వ్యాక్సిన్ వేయిస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్, ఇతరత్రా అవసరాల కోసం కార్యాలయానికి వచ్చేవారు వెంట తెచ్చుకున్న ఆధార్కార్డు సాయంతో అక్కడికక్కడే వివరాలు నమోదు చేయించి టీకా వేయిస్తున్నారు.
అందరూ టీకా తీసుకోవాలన్నదే లక్ష్యం
జుక్కల్ మండలం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నది. ఆ రాష్ర్టాల్లో కరోనా విజృంభిస్తున్నది. ఈ ప్రాంతం వారికి అక్కడివారితో సంబంధాలు ఉండడంతో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అందుకే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కార్యాలయానికి వచ్చే ప్రతిరైతూ వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అని ఆరా తీసి టీకా వేస్తున్నాం.
-సువర్ణ, జుక్కల్ తాసిల్దార్