న్యూఢిల్లీ: భారత మాజీ అటార్నీ జనరల్ సొలిసొరాబ్జీ మరణం దేశానికి తీరని లోటు అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఆయన దేశ న్యాయవ్యవస్థకు ప్రతీక అని కీర్తించారు. భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ ఉన్నతి కోసం విశేష కృషి చేసిన వారిలో సోలీ సొరాబ్జీ ఒకరని రాష్ట్రపతి కొనియాడారు. దేశంలోని ప్రముఖ న్యాయకోవిదుల్లో ఒకరైన సోలీ సొరాబ్జిని భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించిందని గుర్తుచేశారు.
అంతకుముందు రాష్ట్రపతి సొలి సొరాబ్జి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
కరోనా సోకి తీహార్ జైల్లో నలుగురు ఖైదీలు మృతి
పీఎం కేర్స్ కొవిడ్ ఆస్పత్రికి 57 మంది సభ్యుల నేవీ వైద్య బృందం
మహారాష్ట్రలో కరోనా ఆంక్షలు పొడిగింపు
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
ఆసిఫాబాద్లో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
నెట్టుంటే.. నట్టింట్లోనే వైద్యం
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం