జిల్లాలో టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్వై నాయకుల సంబురాలు
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం
సిరిసిల్ల టౌన్, జూలై 6: సబ్బండవర్గాల సంక్షేమమే ధ్యేయం గా తెలంగాణ ప్రదాత, సీఎం కేసీఆర్ జిల్లాకు మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలను మంజూరు చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేం ద్రంలో సంబురాలు జరుపుకున్నారు. స్థానిక ఎల్ల మ్మ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భారీ కటౌట్కు పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. సీఎం ప్రకటించిన వరాల తో సిరిసిల్ల ఎడ్యుకేషన్ హబ్గా నిలువనున్నదని తెలిపారు. మంత్రి కేటీఆర్ సారథ్యంలో జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్, జిల్లా ఇన్చార్జి మానాల అరుణ్, తాళ్లపల్లి అఖిల్గౌడ్, యూసఫ్, రాహుల్, దీపక్, చరణ్, రనీత్ పాల్గొన్నారు.
సిరిసిల్ల రూరల్, జూలై 6: సీఎం కేసీఆర్ జిల్లాకు వరాలు కురిపించడంతో తం గళ్లపల్లి టీఆర్ఎస్వై నేతలు హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్వై జిల్లా నేత, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సిలువేరి చిరంజీవి ఆధ్వర్యంలో మంగళవారం తంగళ్లప ల్లిలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత ఆత్మకూరి చంటి యాదవ్, నల్లకొండ ప్రవీణ్, పూర్ణ చందర్, శ్రీధర్, శ్రవణ్, విటల్రెడ్డి, చిప్ప శ్రీను, శేఖర్, సురేశ్ ఉన్నారు.