హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. మంగళవారం బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సహచర మంత్రులు తలసాని, మహమూద్ అలీ, అధికారులతో కలిసి అరణ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బోనాలకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
ఆలయాల వద్ద క్యూలైన్లు, నీటి సౌకర్యం కల్పించాలని, భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి దర్శనాలు చేసుకోవాలని కోరారు. ఆలయాల వద్ద కూడా మాస్కులను, శానిటైజర్ల్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు సీఎం కేసీఆర్
రూ.15 కోట్ల మంజూరు చేశారని పేర్కొన్నారు. ఆ నిధులను సద్వినియోగం చేసుకుని బోనాలను ఘనంగా నిర్వహించాలచాలన్నారు.
అమ్మవారి ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దాలని, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించాలని తెలిపారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఆలయాలో పాటు జంట నగరాల్లోని ప్రముఖ ప్రదేశాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భూ వివాదం : సినీ నిర్మాత సి.కల్యాణ్పై కేసు నమోదు
తహసీల్దార్పై డీజిల్ పోసి హత్యాయత్నం
పల్లె ప్రగతి నిరంతరం కొనసాగాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
పల్లె ప్రగతితో ఊహించని మార్పు : మంత్రి సబిత
పల్లె ప్రగతిని పక్కాగా చేపట్టాలి : మంత్రి ఐకే రెడ్డి
వరంగల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : మంత్రి ఎర్రబెల్లి
హరితహారంతో ములుగుకు పూర్వవైభవం రావాలి