వరంగల్ చౌరస్తా, జూన్ 9: ఎంజీఎం దవాఖాన లో కరోనా వైద్య సేవల మెరుగు కోసం గ్రేటర్ వరం గల్ 13వ డివిజన్ కార్పొరేటర్ సురేశ్జోషి ఆక్సిజన్ ఫ్లో మీటర్లు అందజేశారు. బుధవారం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ చాంబర్లో ఆక్సిజన్ ఫ్లో మీటర్లను అందజేశారు. కరోనా కాలం లో ఎంజీఎం దవాఖానలో అందుతున్న సేవలను గుర్తించి వాటిని మరింత మెరుగుపరచడానికి వరం గల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సూచ నల మేరకు స్థానిక దాతల సహకారంతో 100 ఆక్సి జన్ ఫ్లో మీటర్లు అందిస్తున్నామన్నారు. వైద్యానికి అవసరమైన ఫ్లో మీటర్లు ఇచ్చేందుకు సహాయ, స హకారాలు అందించిన దాతలకు ఆయన కృతజ్ఞత లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఆసీఫ్, ఠాకూర్ రాజేందర్ సింగ్, ఠాకూర్ రవీందర్సింగ్, షేక్ బాబా, ప్రశాంత్, నెల్సన్ పాల్గొన్నారు.