కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులను మనోజ్(35), విథూ(22)గా గుర్తించారు. కూలీలంతా కేశపట్నంలోని పరమేశ్వర్ రైస్ మిల్లులో పని చేసి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్లో 20 మంది కూలీలు ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా బీహార్ వాసులు.