రాజన్న సిరిసిల్ల : జిల్లా యంత్రాంగం ఒక మంచి అధికారిని కోల్పోయిందని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన అంజయ్య సిరిసిల్ల జిల్లాకు బదిలీపై వచ్చే ముందు నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా పని చేసి అదనపు కలెక్టర్ గా పదోన్నతిపై జిల్లాకు వచ్చారన్నారు.
కరోనా వ్యాధిని జయించి తిరిగి వస్తారని అనుకున్నామని, ఆయన లేరనే వార్త నమ్మలేకపొతున్నామని కలెక్టర్ అన్నారు. అన్ని శాఖలతో సత్సంబంధాలు నెలకొల్పి అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
యాదాద్రిలో ముగిసిన జయంత్యోత్సవాలు
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం