విద్యానగర్, మే 20 : సుభాష్నగర్లోని నిరుపేద కుటుంబాలకు మేము సైతం యువసేన ఫౌండేషన్ ప్రతినిధులు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న 12 కుటుంబాలకు ఫౌండేషన్ అధ్యక్షురాలు చకిలం స్వప్న రైస్ బ్యాగులు, వంట సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బచ్చు కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిం చామన్నారు. ఈ కార్యక్రమంలో స్వప్న రాజుకుమార్, పెద్ది శ్రీనివాస్, చొక్కారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అనాథలు.. వలస కూలీలకు భోజనం ..
కొత్తపల్లి, మే 20 : లాక్డౌన్తో భోజనం దొరకక ఇబ్బంది పడుతున్న అనాథలు, వలస కూలీలకు మంకమ్మతోట మిత్ర బృందం, విద్యుత్ ఉద్యోగులు అండగా నిలిచారు. గురువారం సుమారు 100 మందికి భోజన ప్యాకెట్లను అందజేశారు. ఈ మిత్రబృందం సభ్యులకు ఎలక్ట్రీసిటీ అధికారు లు తోడ్పాటునందిస్తున్నారు. లాక్డౌన్తో ఎవరూ ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశంతోనే భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఎస్ఎన్పీడీసీఎల్ ఎస్ఈ కే మాధవరావు, అధికారులు రాజేంద్రప్రసాద్, కే రాజు, డీ సంపత్కుమార్, రా జరెడ్డి, మిత్రబృందం సభ్యులు కార్పొరేటర్ దిండిగాల మహేశ్, గడప నాగరాజు, కొమ్మురోజు శ్రీనివాస్, వేముల వేణు, చిలువూరు ప్రశాంత్, ఆర్డీ శ్రీధర్, అశోక్రాజ్, రామకృష్ణ పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్టాండ్లో అన్నదానం..
తెలంగాణచౌక్,మే20: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు డిపో-1 సీనియర్ అసిస్టెంట్ కే నారాయణరెడ్డి గురువారం అన్నదానం చేశారు. తోటి సిబ్బందితో కలిసి సు మారు 150 మందికి భోజనం పెట్టారు. ఈ సం దర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ ఈరోజు తన తండ్రి జ్ఞాపకార్థం 150 మందికి ఆహారం పెట్టినట్లు పేర్కొన్నారు. కష్టకాలంలో ఉన్నవారి ఆ కలితీర్చాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చె ప్పారు. ఇక్కడ డిపో1 మేనేజర్ అర్పిత, పర్సనల్ ఆఫీసర్ చంద్రయ్య, అకౌంట్ ఆఫీసర్ లావణ్య, మెకానికల్ ఇంజినీర్ తిరుపతి, అసిస్టెంట్ మేనేజర్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, అన్నదానం చేసిన నారాయణరెడ్డికి ప్రయాణికులు, వలసకూలీలు, యాచకులు కృతజ్ఞతలు తెలిపారు.