వరంగల్ రూరల్ : కరోనా కట్టడికి కార్యోన్ముఖులు కావాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.
ఈ వేసవిలో గ్రామ పంచాయతీలలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కరోనా నియంత్రణపై వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ వేసవిలో కరోనా తీవ్రత కాస్త తక్కువ వున్నా వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. కరోనా వ్యాపించకుండా అన్ని గ్రామాలు కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరు మాస్కులు ధరించేలా చూడాలి. అన్ని బహిరంగ ప్రదేశాలలో సోడియంహైపోక్లోరైడ్ తో శానిటేషన్ చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు వారు పని చేసే చోట నీడ, తాగు నీరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పల్లె ప్రకృతి వనాల మెయింటెనెన్స్ పై కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రత్యేక శ్రద్ధతో, పల్లె ప్రకృతి వనాలలో క్రమంతప్పకుండా చెట్లకు నీళ్లు పోయాలని మంత్రి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
‘మల్లన్న’ ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత
మానవత్వం చాటిన మహబూబాబాద్ పోలీసులు
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
కూలీల ఆటో బోల్తా ..నలుగురికి తీవ్ర గాయాలు