వనపర్తి :పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలో జరిగిన నాలుగో విడత హరితహారం సన్నాహక కార్యక్రమంలో మత్రి మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాల్లో దళితవాడలపై ఫోకస్ చేయాలని అన్నారు. దేశం లో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వినూత్న పథకాలు ప్రవేశ పెడుతున్నారని తెలిపారు.
వీటిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక శాఖలు శ్లాఘిస్తున్నాయని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలకు స్ఫూర్తి దాయకంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. సీఎం దూర దృష్టితో చేపట్టిన ప్రాజెక్టులు, రైతుబంధు వంటి పథకాలు ప్రపంచాన్ని ఆకర్షించాయని, కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనాన్ని డిస్కవరీ ఛానల్ ప్రసారం చేసిందని గుర్తు చేశారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి తీర్మానానికి ముందే తెలంగాణలో సీఎం కేసీఆర్ చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు విజయవంతం చేయాలని సూచించారు.
నిధులు ఉండి అభివృద్ధి చేయని గ్రామ పంచాయతీల నిధులు వెనక్కి తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పల్లెల్లో నిద్ర చేయాలని చేయాలని ఆదేశించారు.అనంతరం పట్టణంలో విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన స్టోర్ను మంత్రి ప్రాంభించారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
మానవత్వం చాటుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి