మహబూబ్నగర్ :మహబూబ్ నగర్ పట్టణంలో నిర్మిస్తున్న జంక్షన్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న క్లాక్ టవర్ నిర్మాణ పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్, ఇంజినీర్లతో సైట్ మ్యాపును పరిశీలించి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ పట్టణం హైదరాబాద్ నగరానికి సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. అందుకు అనుగుణంగా పట్టణ సుందరీకరణ పనులలో భాగంగా అన్ని ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
పట్టణంలో ప్రధాన కూడలి క్లాక్ టవర్ చౌరస్తాను మహబూబ్ నగర్ పట్టణానికే మణిహారంగా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ గణేష్, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన మహబూబాబాద్ పోలీసులు
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
కూలీల ఆటో బోల్తా ..నలుగురికి తీవ్ర గాయాలు