న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. వైరస్ రెండోదశ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. రోజువారీ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పైపైకి వెళ్తోంది. మునుపెన్నడూ లేని విధంగా మహమ్మారి కోరలు చాస్తున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,31,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 780 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,60,542కు చేరింది. కొత్తగా 61,899 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,19,13,292 మంది కోలుకున్నారు.
అలాగే తాజాగా నమోదైన మరణాలతో మృతుల సంఖ్య 1,67,642కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 9,79,608 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. మరో వైపు దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 9,43,34,262 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు 13,64,205 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 25.40 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది.